యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న అమ్మవారి ఆలయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
టీఆర్ఎస్ పాలనలోనే ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.