హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో యాదగిరి తనదైన ముద్రను వేశారని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.