హైదరాబాద్: గోమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం పెరిగిందని అన్నారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి వరకు చేపట్టిన మహా పాదయాత్రను మంత్రి తలసాని హైదరాబాద్ లిబర్టీలోని టీటీడీ ఆలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, గో ఉత్పత్తుల మార్కెటింగ్కు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. గోవు ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్తో పాదయాత్ర చేపట్టిన ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ, ఇతర సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.