కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జమ్మికుంటలోని గుండ్ల చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి ఫలాలు మన కళ్ల ముందున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసినందుకే ఆయా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం లేదు. బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాం. ఈటల రాజీనామా చేసినందుకే చేప పిల్లల పంపిణీ వచ్చిందా? అంతకు ముందు ఈ కార్యక్రమం చేపట్టలేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్, జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, జిల్లా ఫిషరీస్ సోసైటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.