హైదరాబాద్ : పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రాణిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లిదండ్రులకు సూచించారు. సైదాబాద్కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్ ఇద్దరు కుమార్తెలు ఉమైమా పాతిమా, సుమమ పాతిమా ఈ నెల 6వ తేదీ
నుంచి 8వ తేదీ వరకు జరిగిన నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్లో రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కుమార్తెలతో కలిసి ఫసియోద్దీన్ మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంట చిన్న వయసులోనే నేషనల్ జాతీయస్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించడం చిన్నారుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమన్నారు. పతకాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. మరింత రాణించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.