హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్(BRS) పార్టీని మరోసారి గెలిపించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్(Hyderabad) నగర అభివృద్ధి జరిగిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా జరుగని అభివృద్ధి, కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో హైదరాబాద్ నగరం అద్భుతంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు.