హైదరాబాద్ : మళ్లీ అధికారంలోకి వస్తాం.. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. గురువారం వర్షంలోను రాంగోపాల్ పేట(Ramgopal Peta )డివిజన్లో ఇంటింటి ప్రచారం(Minister Talasani )నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
గతంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే పార్టీలను నమ్మొదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మితే మోసపోతామన్నారు. సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా స్థానికులు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.