హైదరాబాద్ : ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డ్(Oscar Award) సాధించడంలో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj)ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) సన్మానించారు. అవార్డును అందుకుని హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ను రాహుల్ సిప్లిగంజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆస్కార్ వేదికపై తెలుగువారి సత్తా చాటినందుకు సిప్లిగంజ్ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అవార్డ్ పొందిన మొట్టమొదటి తెలుగుచిత్రం ఆర్ఆర్ఆర్( RRR )అని మంత్రి కొనియాడారు. భవిష్యత్లోనూ మరింత తన గాత్రంతో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
95 వ ఆస్కార్ అవార్డుల ప్రదానంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట రాసిన చంద్రబోస్, సంగీతమందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రదానంలోనూ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొని పాటను వినిపించారు.