మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లిలో పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవం, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం కాలికి అయిన గాయం నుంచి మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా యజ్ఞం చేశారు. అనంతరం యువ నేత కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. అప్పాయిపల్లి గ్రామంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.