Srinivas Goud : రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు ఎనలేని కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మనిస్ట్రేటివ్ కార్యాలయంలో ఆయన తెలంగాణ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు అండగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర అభవృద్ధికి ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు అభద్రతాభావంతో పనిచేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో పరిపాలన పారదర్శకంగా సాగుతుందన్నారు. సమర్ధుడైన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, అనుభవజ్ఞులైన కమిషనర్ ఉండడంతో అభివృద్ధిలో తెలగాణ పురపాలక శాఖ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజీఓ కేంద్ర కమిటీ అధ్యక్షులు మమత, సీడీఎంఏ డైరెక్టర్ డా. సత్యనారాయణ, టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, టీజీఓ నాయకులు బి. వెంకటయ్య , మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ. కృష్ణయాదవ్, సిటీ అధ్యక్షుడు గండురి వెంకట్, టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, మున్సిపల్ కమిషనర్ల అధ్యక్షుడు టి. కృష్ణ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాబేర్ అలీ, ఉపాధ్యక్షులు కె.రవికుమార్, టీవీఎస్ఎన్ త్రిలేశ్వర్ రావు, ముకుంద రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శైలేజ, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.