మహబూబ్నగర్ రూరల్ : మహబూబ్నగర్(Mahbubnagar) బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి పక్షాలకు అందనంత ఎత్తులో సుడిగాలి పర్యటనలు చేస్తూ వినూత్న రీతిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంత్రి ప్రచార సభకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు బీఆర్ఎస్కే మా మద్దతు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తూ మంత్రికి మద్దతు తెలుపుతున్నారు.
కాగా, గడపగడప తిరుగుతూ చేసిన చేసిన అభివృద్ధి పనులు, చేయాల్సిన హామీలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంగళవారం మహబూబ్నగర్ రూరల్ మండలం బోకొలోను పల్లి, తెలుగు గూడెంలో బైక్పై తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. రైతులు, కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి దీవిస్తే మహబూబ్నగర్ను మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.