హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను సీఎం కేసీఆర్ గుర్తించి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈశాసింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు ప్రభుత్వం ప్రకటించిన 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను గురువారం ఆయన బీఆర్కేభవన్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి అందజేశారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోట్ల నజరానా ప్రకటించి సముచితంగా గౌరవిస్తున్నదని గుర్తుచేశారు. దీనికితోడు ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మరింత ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో కొత్త స్పోర్ట్స్ పాలసీని ఆవిషరించనున్నదని చెప్పారు. కేంద్రం కిన్నెర మొగిలయ్యకు పద్మశ్రీ ప్రకటించిన సమయంలో సీఎం కేసీఆర్ ఘనంగా సతరించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పర్యాటక, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.