హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఓబీసీల కోసం కేంద్రం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. కులగణన, బీసీల సమస్యల పరిషారంపై దేశంలోని వివిధ వర్సిటీల బీసీ విద్యార్థి సంఘాల నేతలు చేపట్టిన ఆందోళనలపై రూపొందించిన వాల్ పోస్టర్ను పర్యాటకభవన్లో మంగళవారం మంత్రి ఆవిషరించారు.
ఈ నెల 15న రవీంద్రభారతిలో నిర్వహించే ఆలిండియా కన్వెన్షన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ ఓబీసీ ఇష్యూస్పై రూపొందించిన వాల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో టీడీసీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్కుమార్, జాతీయ కోశాధికారి ఓ కొండల్, దేశంలోని వివిధ వర్సిటీల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.