హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకొనేందుకు రాష్ట్రం సిద్ధమైంది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారికంగా ఈ పండుగను నిర్వహిస్తున్నట్టు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 6 నుంచి 13 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ వేడుకల కోసం ఉద్యోగినులకు అనుమతులిచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, జాయింట్ సెక్రటరీ రమేశ్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టీజీవో సంఘం అధ్యక్షురాలు మమత పాలొన్నారు.
నేడు రెహమాన్ ‘అల్లిపూల వెన్నల’ పాట విడుదల
తెలంగాణ జాగృతి రూపొందించిన ‘అల్లిపూల వెన్న ల’ బతుకమ్మ పాట మంగళవారం విడుదల కానున్న ది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించ గా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ రచించిన ఈ పాటను ఉత్తరా ఉన్నికృష్ణన్ ఆలపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత పాట హెచ్డీ వీడియోను విడుదల చేయనున్నారు.