హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు ను తెలుగులో ఇచ్చి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు.
హైకోర్టులో మొదటిసారిగా తీర్పును తెలుగులో ప్రకటించడంపై శనివారం ఆమె ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. హై కోర్టు నిర్ణయం కొత్త ఒరవడికి శ్రీకారమని అ న్నారు. ఈ విలక్షణ సంప్రదాయాన్ని న్యాయస్థాన కార్యాలయ నిత్య వ్యవహారాలు, తీర్పు ల్లో కొనసాగించాలని కోరారు.