మహబూబాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్కు (Minister KTR) గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ డా. సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకుని భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి,
BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.