హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి డే సాలర్గా చదువుకోవడానికి బీఏసీ (బెస్ట్ అవైవేబుల్ స్కీం) కింద అవకాశం కల్పించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. మంత్రి సత్యవతి రాథోడ్కు విజ్ఞప్తి చేశాయి.
బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి సత్యవతికి ప్రైవేట్ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. బీఏసీ స్కీమ్ కింద డే స్కాలర్ విద్యార్థులకు 300 సీట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, అమలుకు కృషిచేస్తానని తెలిపారు.