హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కులచర్ల ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియగానే పరిస్థితిని ఆరా తీశారు. గురుకులంలో చదువుతున్న 600 మంది విద్యార్థుల్లో 120 మంది అనారోగ్యం పాలైనట్టు వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. సీజనల్ జలుబు, దగ్గు, జ్వరంతో 20 మంది విద్యార్థులే బాధపడుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు. తప్పుడు ప్రచారాలు చేసి తల్లిదండ్రులు ఆందోళన చెందేలా చేయకూడదని సూచించారు.