ములుగుటౌన్, ఆగస్టు 16: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు చిన్నారి పౌర్ణమి జీవితంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెలుగులు నింపా రు. పాప ఐదేండ్ల వయసులోనే తల్లి కన్ను మూయగా, తండ్రి తన బాధ్యత మరిచాడు. దీంతో నాయనమ్మ వద్ద ఉంటూ అక్క జ్యోతి సహాయంతో విరిగిన చక్రాల కుర్చీలో సూల్ కు వెళ్తున్నది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని చలించిపోయిన మంత్రి సత్యవతిరాథోడ్ వెంటనే పాప సమస్యను పరిషరించాలని కలెక్టరేట్ను ఆదేశించారు. రూ.80 వేల విలువైన ఎలక్ట్రికల్ వీల్చైర్తోపాటు దివ్యాంగుల పెన్షన్ను పునరుద్ధరించారు. బుధవారం ములుగుకు చేరుకున్న మంత్రి చిన్నారికి వీల్చైర్ అందించారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెడ్కో చైర్మన్ సతీశ్, జడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి, ఐటీడీఏ పీవోఅంకిత్ పాల్గొన్నారు.