మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మంత్రి సత్యవతి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరారు.