హైదరాబాద్ : గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వికారినామ సంవత్సరం-2019 పేరుకు తగ్గట్టు వికృతంగా నాట్యం చేసింది.
శార్వరి (అంటే, చీకటి) నామ సంవత్సరం -2020 ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టింది. రేపటి నుంచి ప్లవ నామ సంవత్సరం మొదలు కానుంది.
ప్లవ అంటే దాటించునది అని అర్థమని ఇక రెండేళ్లుగా పడుతున్న కష్టాలు తొలగిపోవాలి ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వీటి ఫలితాలు ప్రజల కళ్లముందే కనపడుతున్నాయని పేర్కొన్నారు.
ఏటా రూ.10వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 40లక్షలకు పైగా మందికి పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ఎస్సీలకు ఈ బడ్జెట్లో జనాభాకు అనుగుణంగా రూ.వెయ్యి కోట్లు అదనపు నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి పాల్పడుతున్నారన్నారు.
ఇటీవలే గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలు చేసుకునేందుకు వరంగల్ లో ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నామన్నారు.
గతేడాది కంటే వందశాతం అధికంగా ట్రైకార్కు నిధులు కేటాయించి, గిరిజన యువతకు ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి