హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగా ణ)/ కురవి: రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా (80) శుక్రవారం మృతి చెందారు. గుండె నొప్పితో బాధపడుతున్న దస్మాకు ఈ నెల 12న నిమ్స్లో గుండెకు స్టంట్ వేశారు. తిరిగి నాలుగు రోజుల క్రితం మరోసారి అనారోగ్యం బారిన పడగా యశోద హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.
మంత్రి సత్యవతీ రాథోడ్ తల్లి గుగులోత్ దస్మా మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. మంత్రి కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.