హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ తెలిపారు.
ఒకే ఒక్క క్లిక్తో మెరుపు వేగంతో ఫలితాలను తెలుసుకొనే అవకాశముండగా, విద్యార్థులు ఇందుకోసం ntnews.com వెబ్సైట్ను కూడా సంప్రదించవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.