హైదరాబాద్ : రేపు టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 4న ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 2 లక్షల 51వేల 606మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,64,962 మంది, మెడికల్ విభాగానికి 86,644 మంది దరఖాస్తు చేసుకున్నారు.