Minister Sabitha Indra Reddy | విద్యార్థులు తమ భవిష్యత్ ఆశయాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు.
సోమవారం సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, భాష, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన పాల్గొన్నారు.