బడంగ్పేట ( హైదరాబాద్ ) : సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైపులైన్, కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) ఒక వైపు సంక్షేమం(Welfare), మరో వైపు అభివృద్ధి( Development)కి నిరంతరం కృషి చేస్తున్నారన్నారని వెల్లడించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు(Funds) మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
కార్పొరేషన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేస్తూ ప్రజా అవసరాలకు పరిష్కరిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిఫ్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, బడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.