ఖమ్మం : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గొదావరి ఉధృతి మంగళవారం కొంత మేర తగ్గింది. సీఎం కేసీఅర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే బస చేశారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అక్కడ పరిస్థితులను సీఎంకు ఫోన్ ద్వారా వివరిస్తున్నారు.
మంగళవారం ఉదయం గొదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహం, పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికి అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ.. బ్లీచింగ్ శానిటేషన్ చేయలని అదేశించారు.
మంత్రి వెంట జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, తదితరులు ఉన్నారు.