హైదరాబాద్: నగరంలోని తార్నాక హాస్పిటల్లో నర్సింగ్ కోర్సులు ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ నర్సింగ్ కాలేజీని (RTC nursing college) ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించనున్నారు. దీంతోపాటు తార్నాక దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్, పరిపాలన బ్లాక్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు.
అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీ ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. మొత్తం 50 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 30 సీట్లు, మేనేజ్మెంట్ కోటా కింద 20 సీట్లు ఉన్నాయి.
కాగా, తార్నాక దవాఖానను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చనున్నారు. దీంతోపాటు ఆర్టీసీ సిబ్బందితోపాటు సాధారణ రోగులకు కూడా వైద్య సేవలు అందించాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే.