హైదరాబాద్ : తెలంగాణ రోడ్లు – భవనాలు, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై శుక్రవారం ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు, వ్యయంలపై, 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. తగు మార్పులు, చేర్పులు చేసి ఆర్ధిక శాఖకు తుది బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, రోడ్లు భవనాలు శాఖ సెక్రెటరీ శ్రీనివాస రాజు, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, సీఈ సతీష్, మధుసూధన్, గృహ నిర్మాణ శాఖ ఎస్ఈ చైతన్య కుమార్, రవీందర్ రెడ్డితో పాటు రాష్ట్రస్థాయి ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.