చేర్యాల : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగించాలని తాను కొరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ (Minister Ponnam) తెలిపారు. ఆదివారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి పొన్నం కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహామండపంలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామి వారి క్షేత్రంలోని గెస్ట్హౌజ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు స్వామి వారిని దర్శించుకున్నానని, ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చిన స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లిం చుకున్నట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ సస్యశ్యామలం కావాలని మల్లన్నను వేడుకున్నట్లు తెలిపారు.