నవాబ్పేట, జనవరి 19 : ధార్మిక చింతనతో(Religious thinking)నే మానసిక ప్రశాంతత లభిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరులో ఏర్పాటు చేసిన శ్రీచింతలపురి చిన్మయ స్వామి మఠం రజతోత్సవ వేడుకల ప్రారంభోత్సోవానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడిని కొలిస్తేనే ఆయన శక్తియుక్తులు కలిగిస్తారని చెప్పారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గం అనుసరిస్తే ముక్తి ప్రాప్తిస్తుందని తెలిపారు. కొల్లూరులో చిన్మయస్వామి మఠాధిపతి శ్రీనందీశ్వర స్వామి పెద్ద ఎత్తున రజతోత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు.
శ్రీశైలం పుణ్యక్షేత్ర పీఠాధిపతి 1008వ జగద్గురు శివాచార్య మహాస్వాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావంతో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూధన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాజేశ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.