హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. పూర్వ వీఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ఇచ్చి, సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు చెప్పేందుకు తెలంగాణ రెవెన్యూ ఎం ప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు శక్తివంచన లేకుండా కృషి చే స్తున్నారని ప్రశంసించారు.
రెవె న్యూ ఉద్యోగుల సమస్యలు పరిషరిస్తామని హామీ ఇచ్చారు. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుకు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించాలని కోరారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5వేలమందికిపైగా ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, ట్రెసా పూర్వ అధ్యక్షుడు శివశంకర్, పూర్వ కార్యదర్శి, కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు పడిగెల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.