నిర్మల్ : రైతుబంధు రూ.50 వేల కోట్ల మైలురాయిని దాటుతున్న నేపథ్యంలో జిల్లాలో మంగళవారం రైతు బంధు వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో రైతులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు.
రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎండ్ల బండినెక్కి మంత్రి ఊరేగింపులో పాల్గొన్నారు. విద్యార్థినిలు, మహిళలు వేసిన రంగు రంగుల ముగ్గులను పరిశీలించి, వారిని అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నారన్నారు. రైతు బంధుతో రైతుల పెట్టుబడి కష్టాలు తప్పాయని, రైతుబంధుతో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు.