హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): టీజీఎంఎస్ఐడీసీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్టు భవన్లో సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస్)ల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న రెండు కమిటీలకు అదనంగా మరో మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) దవాఖానలకు సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్మెంట్, సివిల్ వర్క్స్లను రెగ్యులర్గా పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించాలని తెలిపారు.