హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ల పేరుతో ప్రజల మధ్య బీజేపీ వైషమ్యాలు సృష్టిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమేందుకు మోదీ సరార్ కుట్రలు పన్నుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ను కాదని బీజేపీకి అవకాశమిస్తే, దేశాన్ని ప్రమాదపుటంచుల్లో నిలబెట్టారని విమర్శించారు. రెడో చైర్మన్గా నియమితులైన వై సతీశ్రెడ్డి శుక్రవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో గల రెడో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తకళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, అరూరి రమేశ్, కార్పొరేషన్ల చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేశ్, రెడ్కో వీసీ, ఎండీ వీ జానయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా బీజేపీ అసత్యప్రచారాలకు దిగుతున్నదని, ఈ ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. గుజరాత్ నమూనా అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, అదే గుజరాత్ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందని పేర్కొన్నారు. వ్యవసాయానికి 6 గంటలు కూడా విద్యుత్తు ఇవ్వకపోగా, పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. యావత్ దేశంలో చీకట్లు అలుముకున్న రోజున సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. అలాంటి నాయకుడి నేతృత్వంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ తప్పక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. రెడో చైర్మన్గా సతీశ్రెడ్డి నియామకం అందులో భాగమేనని అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.