Minister KTR | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ… ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ. వైఫల్యాల మోదీకి 2024లో గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ‘మోదీని మరోసారి ప్రధాని పీఠం ఎకిస్తే.. దేశాన్ని బలిపీఠం ఎకించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారు’ అని తెలిపారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతికి చిక్కిందని, కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిల్లాడుతున్నదని ఎద్దేవా చేశారు.
‘హిండెన్బర్గ్ రిపోర్ట్తో బీజేపీ ఫుల్ పిక్చర్ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రైలర్ అవసరం లేదు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడువవు, ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు’ అని స్పష్టం చేశారు. అదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హకు ఉందా? అని నిలదీశారు. ముకునేలకు రాసినా, మోకాళ్ల యాత్ర చేసినా, మోసాల మోదీని తెలంగాణ నమ్మదని, బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని పేర్కొన్నారు. తుప్పుపట్టిన తుపాకీని ఎంఐఎం భుజంపై పెట్టి బీజేపీ ఎంతకాలం కాలుస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అని, పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. బారాణా తీసుకొని చారాణా కూడా ఇవ్వని బీజేపీకి మిగిలేది బూడిదేనని స్పష్టంచేశారు.
అదానీ విషయంలో జేపీసీ కాదుకదా.. కనీసం సిట్ కూడా వేయనివారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘గుజరాత్లో మోదీ హయాంలో మీరు హోం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకులలో గుజరాత్ నంబర్ వన్గా ఉన్నమాట నిజం కాదా? గత ఎనిమిదేండ్లలో గుజరాత్లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా? ఈ దేశంలో వ్యాపం లాంటి అతి జుగుప్సాకరమైన సాం చేసింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా?’ అని నిలదీశారు. అయినా నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడటం వారికే చెల్లిందని మండిపడ్డారు. ‘పీఎం కేర్స్లో ఎంత జమైంది – ఏ విధంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు.. కాగ్ ఆడిట్ పీఎం కేర్స్కు వర్తించదు అని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు.. కాగ్తోపాటు అన్ని రకాల బ్యాంక్ల ఆడిట్లతో కట్టిన ప్రాజెక్ట్లపై మాట్లాడటం.. అవివేకం కాక మరి ఏమిటి?’ అని నిలదీశారు. ఎనిమిదేండ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇకడికి వచ్చి ఎవరో గులాములు రాసిచ్చిన స్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరు? అని అమిత్షాను ప్రశ్నించారు.
తెలంగాణలో ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయ విద్యాలయాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలకు అమిత్షా శంకుస్థాపన చేశారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమిత్షా జీ.. గత 9 సంవత్సరాల్లో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పేరు ఎందుకు చెప్పడంలేదంటూ నిలిదీశారు. ‘అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా వీటికి శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు.. ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయ విద్యాలయాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీ.. ఆగండి… ఆయన అవేమీ చేయలేదు’ అంటూ ఎమోజీ జత చేశారు.