హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 29న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్-బెంగళూరు రహదారి 12 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.
సంగారెడ్డి-నాందేడ్- అకోలా రహదారి161ని శంషాబాద్ వద్ద గడ్కరీ ప్రారంభిస్తారు. బోయినపల్లి-కండ్లకోయ వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ, అప్పా జంక్షన్-మన్నెగూడ రహదారి పనులను ప్రారంభిస్తారు.