హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2022ను మంత్రి హరీశ్ రావు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్లో వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
భారీగా నిధులు కేటాయించిన సీఎంకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం ముందుచూపుతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందన్నారు. ఏడేళ్లలో వ్యవసాయ రంగానికి రూ.83,989 కోట్లు ఖర్చు చేశారన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. గతేడాది కన్నా ఈసారి వ్యవసాయశాఖకు ఎక్కువ నిధులను కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు.