వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan reddy)అన్నారు. ఆదివారం వనపర్తి మండలం నాగవరం తండా వద్ద బీఆర్ఎస్(BRS) జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాలలో సమూల మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.రైతుబంధు9Raitu Bandu), రైతుబీమా, ఉచిత కరెంటు, సాగునీరు రైతన్నల తలరాత మార్చాయని పేర్కొన్నారు.విద్య, వైద్యం, సంక్షేమ, ఉపాధి రంగాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. ఒకనాడు ఆకలితో అల్లాడిన తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ తరహా పాలన, పథకాలు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన విజయాలకు తార్కాణాలని అన్నారు.