జోగులాంబ గద్వాల : వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంట్ లోవోల్టేజ్ లేకుండా సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అయిజ మండలంలోని ఉప్పల గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాన ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని ఆంధ్ర నాయకులు హేళనగా మాట్లాడారు. కానీ, సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్ పోకవడం లేదన్నారు. రైతులకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
భారీ వర్షాలకు కురుస్తున్నప్పటికి విద్యుత్లో అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. సబ్బండ వర్ణాలక సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యే అబ్రహం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు ఉన్నారు.
Minister Niranjan Reddy , Agriculture related sectors,Sub station,Telangana