Minister Niranjan Reddy | సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలేనని మంతి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాతికి రూపాన్ని ఇచ్చి దేవున్ని చేస్తారన్నారు. రైతుకు, వ్యవసాయానికి అవసరమైన నాగలి, కర్రు, గొర్రు, మేడితోక చేసేది విశ్వబ్రాహ్మణులేనన్నారు. పుట్టిన పిల్లలకు తొట్టెల దగ్గర నుంచి మనిషి అంతిమ సంస్కారాలకు అవసరమైన వాటికి సహకరిస్తున్నారన్నారు.
కాలక్రమంలో నాగరికత మార్పులో అనేక వృత్తులు రూపాంతరం చెందుతాయన్నారు. ఈ పరిస్థితుల్లో విశ్వకర్మలు కూడా ఇతర రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ సార్ జీవితాంతం పాటుపడ్డారని, ఆయన జ్ఞాపకార్థం వనపర్తి పార్టీ కార్యాలయం పక్కన ఆయన పేరిట పేరు, అందులో విగ్రహం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే ప్రారంభోత్సవం ఉంటుందని, విశ్వకర్మలు అందరూ ఆ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.