వనపర్తి : ఈ ఎన్నికలు ఒక్కరి కోసం కాదు. మన బతుకులు మార్చే ఎన్నికలని ఆలోచించి ఓటు వేయాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. శుక్రవారం శ్రీరంగాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారాన్ని(Election campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. మూడు నెలలుగా వర్షాలు లేకపోయినా మనం నింపుకున్న నీళ్ల ద్వారా వ్యవసాయం కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం.
వనపర్తి జిల్లాను చేసి మెడికల్ కళాశాలను తీసుకొచ్చానని తెలిపారు. ఆరు వందల పడకల సామర్థ్యం గల దవాఖాన పనులు జరుతున్నాయి. ప్రతి మండలంలో ప్రాథమిక దవాఖాన, రెండు మూడు మండలాలకు కలిపి సబ్ సెంటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. యాభై ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. కానీ ఇక్కడ వచ్చి మేము చేస్తాం అని చెబితే కాంగ్రెస్ చెబితే ఎవరు నమ్మరన్నారు. రెండు పర్యాయలు అవకాశం ఇచ్చారు. అందుకే అన్ని అభివృద్ధి పనులు చేసి మీ కండ్ల ముందు పెట్టాం. మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.