వనపర్తి : రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను పరిష్కారిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వీఆర్ఏల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. వనపర్తిలో ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను మంత్రి నిరంజన్ రెడ్డి కలిశారు. తప్పకుండా న్యాయం చేస్తామని వారికి మంత్రి భరోసానిచ్చారు.
ఆందోళనలతో సమయం వృధా చేసుకోవద్దని సూచించారు. తమ వంతుగా ముఖ్యమంత్రి దృష్టికి మీ సమస్యలు తీసుకువెళ్తామని చెప్పారు. తప్పకుండా సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. వెంటనే విధుల్లో చేరాలని వీఆర్ఏలను మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.