నిజామాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్ మండలం చేపూర్లో ఆయిల్ పామ్ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ అంతా ఆయిల్ పామ్ పంటలదేనని మంత్రి స్పష్టం చేశారు. వరి పంటతో పోలిస్తే ఆయిల్ ఫామ్తో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయి.
ఆయిల్ పామ్ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అవగాహన సదస్సులతో పాటు ప్రభుత్వం అందించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.