కొల్లాపూర్ : దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 25 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పద్మావతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్కు చ్చిందని, దళితబంధు తీసుకునేవారంతా లబ్ధిదారులు కాదు.. హక్కుదారులన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్లో ప్రజల్లో ఈ పథకం కీలక డిమాండ్ ఉంటుందన్నారు.
సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ దళితబంధు ఇతర రాష్ట్రాల్లో ఆశాజనకంగా డిమాండ్గా ఉంటుందని, దళితబంధు పథకం లబ్ధిదారులు పట్టుదలతో కష్టపడి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. అనంతరం మాధవవస్వామి ఆలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పెంట్లవల్లిలో నమాజ్ కట్ట ఆధునికీకరణలో భాగంగా రోడ్డు వెడెల్పు, మినీ ట్యాంక్ బ్రిడ్జి కోసం రూ.3కోట్లతో భూమిపూజ చేశారు.