వనపర్తి : వనపర్తి(Wanaparthi)లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. జిల్లాలో కేంద్రంలోని మీడియా సెంటర్లో మీడియాతో మాట్లాడిన అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీనే నిరంజర్ రెడ్డిపై దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.