వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రకృతిలోని పూలన్నింటినీ పూజించే ఏకైక నేల తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో శనివారం జూమ్ యాప్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణీయులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అంటే పూలు పేర్చడం కాదు.. కోల్పోయిన బతుకును పునరుద్ధరించడం అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ విషయంలో అదే చేసి యావత్ ప్రపంచానికి చూపించారని అన్నారు. తెలంగాణ విశిష్టతను భవిష్యత్తరాలకు అందించేందుకు ప్రవాసులు చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.