మేడ్చల్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): ప్రపంచ కార్మికదినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేయనున్నది. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
శ్రమశక్తి అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఫైల్పై కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. తన చాంబర్లో ప్రవేశిస్తున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.