శామీర్పేట : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ (BRS)పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పథకాలను గడప గడపకు తీసుకెళ్లి పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఉంటుందని పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్(BRS) మండల అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, గ్రామ అధ్యక్షుడు దుర్గం వెంకటేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, డైరెక్టర్ బిక్షపతి, పార్టీ మాజీ అధ్యక్షుడు విష్ణుగౌడ్, దత్తుగౌడ్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
కొల్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ మండల యూత్ లీడర్ పి.సంతోష్రెడ్డి, పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు ఆర్ వెంకటేశ్, ఉద్దెమర్రి వెంకటేశ్, కే రాజశేఖర్, ఎం దామోదర్రెడ్డి, భాస్కర్రెడ్డి, అభినయ్రెడ్డి, భరత్రెడ్డి, ఎల్లేశ్, వెంకటేశ్, ఎల్ నవీన్, కే శ్రావణ్ తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.