Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో.. ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, మైనంపల్లి హన్మంతరావు మాస్ స్టెప్పులకు డ్యాన్స్లు చేస్తూ.. ఊగిపోయారు. అందరిలో జోష్ నింపారు. విజయ సంకేతం చూపిస్తూ.. మురిసిపోయారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అబ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో మాస్ స్టెప్పులేస్తూ.. ఆనందంలో మునిగిపోయిన మంత్రి మల్లారెడ్డి.. @chmallareddyMLA #MunugodeBypoll pic.twitter.com/fIwT3XP8XT
— Namasthe Telangana (@ntdailyonline) November 6, 2022